10-06-2025 12:22:30 AM
భయాందోళనలో కాలనీవాసులు
చేగుంట, జూన్ 9 : మండల కేంద్రమైన చేగుంటలోని సీఎంఆర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. హమాలీ కాలనీలో చందాయిపేట్ గ్రామానికి చెందిన చిట్ట బోయిన ఆంజనేయులు తన ఇంటికి తాళం వేసి ప్రైవేట్ కంపెనీలో ఆదివారం డ్యూటీకి వెళ్లారు. సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళగా ఇంటి తాళం పగలగొట్టబడి ఉందని, దొంగలు ఇంట్లో ఉన్న బీరువా ధ్వంసం చేసి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, కొంత నగదు ఎత్తుకెళ్ళినట్లు బాధితుడు తెలిపారు.
అలాగే జర్నలిస్ట్ కాలనీలో సైతం తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. జర్నలిస్టులు అయిత రఘురాములు, కాశబోయిన సుధాకర్ ఇండ్లలో దొంగలు బట్టలు, వస్తు సామాగ్రిని దోచుకెళ్ళినట్లు తెలిపారు. ఒకేరోజు వరుసగా ఇండ్లలో దొంగతనాలు జరగడంతో కాలనీ వాసులు భయపడుతున్నారు. ఈ మేరకు చేగుంట ఎస్త్స్ర చైతన్య కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి క్లూస్ టీంను రప్పించి దర్యాప్తు చేస్తున్నట్లుతెలిపారు.