calender_icon.png 10 May, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేవైఎం ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం

24-04-2025 02:04:31 AM

కామారెడ్డి , ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం  కామారెడ్డి శాఖ  ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం సాగర్ చౌరస్తా లో ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దగ్ధం  చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ నిన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పాల్గహం లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు   తెలిపారు. ఉగ్రవాదులు యాత్రికుల పై దాడి చేసేటప్పుడు వారిని హిందువులుగా గుర్తించి హిందువులను మాత్రమే దాడి చేసి చంపి, ప్రధానికి హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు చెప్పడాన్ని ప్రతి హిందువు అర్థం చేసుకోవాలని సూచించారు.

ప్రాంతాల పేరిట, కులాల పేరిట, భాషల పేరిట హిందువుల విడి పోతే, ఉగ్రవాదులు మాత్రం ఏ ప్రాంతం, ఏ భాష, ఏ కులము అని చూడకుండా కేవలం హిందువులు అయితే చాలు వారిని చంపేశారని ఇకపై అయినా హిందువులు ఐక్యంగా ఉండాలని సూచించారు.  ఉగ్ర దాడి నీ ఉపేక్షించేది లేదని సాధ్యమైనంత తొందరలోనే నరేంద్ర మోదీ  ప్రభుత్వం ఇంతకు రెట్టింపు ప్రతీకార దాడులు జరుపుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి నరేందర్ రెడ్డి బిజెపి నాయకులు శ్రీనివాస్ నరేందర్ సంతోష్ రెడ్డి సురేష్ ప్రవీణ్ మహేష్ రాజగోపాల్ బాలమణి గుణేందర్ లక్ష్మీపతి రవీందర్ కామునిగోవర్ధన్ సరికొండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.