11 April, 2026 | 5:40 PM

Breaking News

కేబుల్ న్యూస్ ఛానల్ వారు దరఖాస్తు చేసుకోవాలి

11-04-2026 03:56 PM

నిర్మల్,(విజయక్రాంతి): కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు రాష్ట్ర,జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డులు పొందటానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సమాచార మరియు పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారి విష్ణువర్ధన్ తెలిపారు. రాష్ట్ర కమిషనర్ ప్రియాంక ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయన్నారు. హైదరాబాద్ నగర కేంద్రంగా స్టూడియోలు కలిగి, స్థానికంగా, జిల్లాలలో ప్రసారాలు అందించే చానళ్ళు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్డులు పొందటానికి, జిల్లా స్థాయిలో స్టూడియోలు కలిగిన వారు ఆయా జిల్లాల్లో కార్డులు పొందటానికి నేరుగా ఈ నెల 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. దరఖాస్తులో ఛానల్ పేరు మరియు స్టూడియో అడ్రస్ తో పాటు, ఎమ్ ఐ బి సర్టిఫికెట్, లేబర్ లైసెన్స్, ఎం ఎస్ ఓ లతో చేసుకున్న ఛానల్ ప్లేస్మెంట్ అగ్రిమెంట్ల కాపీలను జతచేసి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.అర్హత గల ఛానళ్లకు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో అక్రిడేషన్స్ జారీ చేయబడతాయని వివరించారు.