బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టండి
08-06-2026 05:41 PM
బోథ్,(విజయక్రాంతి): త్వరలో ప్రారంభం కానున్న బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ కోరారు. సోమవారం ఆయన నివాసంలో తాంసి బీంపూర్ మండలం నాయకులకు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే బూత్ నియోజకవర్గం సభ్యత్వ నమోదులో ముందుండాలని సూచించారు. ప్రతి కార్యకర్త మరో ఇద్దరిని పార్టీలో చేర్పించి సభ్యత్వ నమోదు చేయిస్తే ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా సభ్యత్వాలు నమోదు అవుతాయి అన్నారు.కార్యక్రమంలో ఆయా మండలాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






