8 June, 2026 | 7:03 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం

08-06-2026 05:39 PM

* ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  ప్రారంభించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా నూతన మండల,పట్టణ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. కార్యకర్తలకు పార్టీ, ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్నారు.

మంగళవారం ఉట్నూరులో  నిర్వహించే బిఎల్ఎ ట్రైనింగ్ బిఎల్ఎ లు  సమావేశానికి ప్రతి ఒక్కరు  హాజరు కావాలన్నారు.దేశంలో ఇంధన కొరత వల్ల ఇంధన ఆదా చేయడంలో భాగంగానే నేను కూడా ద్విచక్ర వాహనం పైన పర్యటిస్తున్న అన్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు.సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోమసే నాగోరావ్ గారు పార్టీకి చేసిన సేవలు గుర్తు చేశారు.పార్టీలో కొత్త పాత తేడా లేకుండా ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అన్నారు.