ఎండ నుండి కాపాడుకుంటూ పనులు చేసుకోండి: ఏపీవో
19-05-2026 05:21 PM
బోథ్,(విజయక్రాంతి): ఉపాధి హామీ కార్యక్రమంలో పనిచేస్తున్న కూలీలు ఎండ నుండి కాపాడుకుంటూ పనులు చేసుకోవాలని ఏపీవో జగదే రావు కోరారు. మంగళవారం మండలంలోని పాట్నాపూర్ గ్రామాలలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎండకు పనులు చేయవద్దని త్రాగునీటిని ఎక్కువగా తాగాలన్నారు.






