06-06-2025 01:26:37 AM
గద్వాల, జూన్ ౫ (విజయక్రాంతి): గద్వా ల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దని 12 గ్రామాల ప్రజలు, రైతులు బుధవారం ఆగ్రహ జ్వాలలతో నిరసన వ్యక్తం చేసిన విషయం తెలి సిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచల నం రేకెత్తింది. ఇథనాల్ కంపెనీ పనులను అడ్డుకోవడంతో పాటు వాహనాలు పడగొట్టిన ఘటనకు సంబంధించి కంపెనీ సీఈ వో మంజునాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పో లీసులు 40 మందిపై కేసును నమోదు చేశా రు.
ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు బుధవారం రాత్రి మానవపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనకు పాల్పడిన వారి వీడియోలను పరిశీలించి 40 మందిపై కేసు నమోదు చేసి వీరిలో 12 మందిని పోలీసులు అరెస్టు చేసి గురువారం గద్వాల జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించింది
గోప్యత పాటిస్తున్న పోలీసులు
పెద్ద ధన్వాడ ఘటనకు సంబంధించి బుధవారం సాయంత్రం నుంచి ఆయా గ్రా మాల రైతులు, ప్రజలను అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. రాజోలి మండల పోలీస్ స్టేషన్లో కంపెనీ సీఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు 40 మందిపై కేసు నమో దు చేసినట్లు ఎఫ్ఐఆర్ కాపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నప్పటికీ ఎంత మందిపై కేసు నమోదు, ఎంత మందిని రిమాండ్ తరలించరన్నా విషయాన్నీ మా త్రం పోలీసులు అధికారంగా బయటకు చె ప్పడం లేదు.
ఈ విషయంపై శాంతి నగర్ సీఐకి ఫోన్ చేయగా స్పందించలేదు. రాజో లి ఎస్సై జగదీశ్వర్ను ఫోన్లో సంప్రదిస్తే వివరాలు బయటకు చెప్పవద్దని ఆదేశాలు ఉన్నాయనడం అనుమానాలకు తావు తీస్తోంది.