06-06-2025 01:24:35 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల, జూన్ 5 (విజయక్రాంతి): జిల్లా కేంద్రం జగిత్యాల, నియోజకవర్గంలోని రాయికల్ పట్టణ అభివృద్ధికి రా ష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 70 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణ 9వ వార్డు లింగం చెరువు వద్ద గురువారం వన మహోత్సవ కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మేల్యే మాట్లాడుతూ నూకపల్లి డబు ల్ బెడ్రూమ్ కాలనీ జగిత్యాలలో కలపడం జరిగిందన్నారు. జగిత్యాల పట్టణ చుట్టుపక్కల పరిసర గ్రామీణ ప్రాంతాలు జగిత్యాలలో కలపడంవల్ల ఆయా ప్రాంతాల అభివృద్ధి వే గంగా జరుగుతుందన్నారు. ఇటీవల చేపట్టిన 100 రోజుల ప్రణాళికతో పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనం వీలైనంతగా మెరుగౌతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టణంలో 18 వేల ఇండ్లకు ఉచిత కరెంట్.20 వేల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామని, పట్టణంలో ప్రస్తుతం 25 కోట్ల తో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు.
జగిత్యాల పట్టణ విలీన ప్రాంతాలకు రూ. 20 కోట్లు, స్పెషల్ గ్రాంట్ రూ. 50 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అలాగే జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ పట్టణానికి రూ. 15 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా ఈ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి జగిత్యాల ప్రజల పక్షాన ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
జగిత్యాల పట్టణంలో తాగు నీటి కోసం రూ. 36 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు, ఎస్కేఎన్ఆర్ కళాశాలలో తాగునీటి ట్యాంక్ నిర్మాణంతో శంకులపల్లె, పోచమ్మ వాడ, హనుమాన్ వాడ తదితర ప్రాంతాల నీటి కష్టాలు తీరుతాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ కౌన్సిలర్లు శ్రీలత రామ్మోహన్ రావు,కోలగాని సత్యం, క్యాదాసు నవీన్, సిరికొండ రాజయ్య, వొంటిపులి రాము, ములసపు మహేష్, చిట్ల మనోహర్, రవి శంకర్, మున్సిపల్ సిబ్బంది, తదితరులుపాల్గొన్నారు.