06-06-2025 01:28:07 AM
రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూన్ 5 (విజయ క్రాంతి): నిధుల సమీకరణపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం సచివాల యంలో రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ స బ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ స మావేశంలో సబ్ కమిటీ సభ్యుడు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు పా ల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రతి వారం జరుగుతుందని, తాజా సమావేశం లో తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమ లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రగతిని వచ్చేవారం సమావేశంలో అంశాల వా రీగా సమీక్షిస్తామని తెలిపారు.
రెవెన్యూ రిసో ర్స్ మొబిలైజేషన్కు సంబంధించి వివిధ శా ఖల ఉన్నతాధికారులు చెప్పిన అంశాలు, వా టి పురోగతిని నిరంతరం పరిశీలించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేక అధికారిని నిర్మించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సంద ర్భంగా శాఖల వారీగా అంశాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు.
సమావేశం లో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్రాజ్, ఎక్సుజ్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, సీసీఎల్ఏ సె క్రటరీ నవీన్మిట్టల్, మైనింగ్ శాఖ ప్రిన్సిప ల్ సెక్రటరీ శ్రీధర్, కమిషనర్లు హరిత, హరికిరణ్, విష్ణువర్ధన్, సురేంద్రమోహన్, బుద్ధ ప్రకాశ్ జ్యోతి, ఇలంబర్తి, ఆర్వీ కర్ణన్ ఉన్నారు.