9 April, 2026 | 5:23 PM

Breaking News

అల్లు అర్జున్ బర్త్‌డేకు ఆరోగ్య కానుక   •   ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •  

రెచ్చిపోయిన ఏటీఎం దొంగలు

27-12-2025 11:54 AM

హైదరాబాద్: ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. నిజామాబాద్(Nizamabad) నగరంలో ఆర్యానగర్, సాయినగర్ ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని భారీ చోరీ జరిగింది. ఐదుగురు సభ్యుల ముఠాగా భావిస్తున్న దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించి ఏటీఎంలను పగలగొట్టి నగదు దోచుకున్నారు.  సాయినగర్ లోని ఎస్‌బిఐ ఏటీఎంలో సుమారు రూ.10 లక్షలు, ఆర్యానగర్‌లోని డీసీబీ ఏటీఎంలో రూ. 27 లక్షల భారీ మొత్తాన్ని దొంగిలించారు. ఏటీఎం లోపలికి ప్రవేశించేందుకు ఉపయోగించిన గ్యాస్ కట్టర్ వేడికి కొంత కరెన్సీ కాలిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర రెండు నేర స్థలాలను పరిశీలించారు.