calender_icon.png 13 November, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్‌పై ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తుది చార్జ్ షీట్

29-07-2024 04:47:15 PM

న్యూఢిల్లీ: మద్యం పాలసీ కుంభకోణంతో సంబంధం ఉన్న అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ప్రత్యేక కోర్టులో తన ఛార్జిషీట్ దాఖలు చేసింది. సిఎం కేజ్రీవాల్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరిగింది. 

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను నిందితులుగా పేర్కొంటూ తన ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. ఈడీ కేసుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్‌ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని జూలై 12న సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సీబీఐ అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన జైలు నుండి బయటకు రాలేకపోయారు. ఇటీవల, ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు ఆగస్టు 8 వరకు పొడిగించింది.