13 April, 2026 | 11:54 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు పెడతాం: భట్టి విక్రమార్క

13-11-2025 03:22 PM

ప్రజలకే జవాబుదారీగా ఉంటాం

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం(Mudigonda Mandal) గంధసిరిలో శ్రీ సుందర మౌళీశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) శంకుస్థాపన చేశారు. రూ. 2 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... ప్రజలకే జవాబుదారీగా ఉంటామని తెలిపారు. విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా కరెంట్ సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామని పేర్కొన్నారు. కరెంటును రైతులకు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వామేనని ఆయన పునరుద్ఘాటించారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఎంత త్వరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు పెడతామని భరోసా కల్పించారు. ప్రజల సొమ్ము దోపిడీకి గురి కానివ్వమన్నారు. ఎక్కడ ఉన్నా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. మధిర ప్రజలు వేసిన ప్రతి ఓటుకు గౌరవం తీసుకువస్తానని భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు.