సీసీ రోడ్డు పనులు ప్రారంభం
చెన్నూర్, మార్చి 30 : చెన్నూర్ నియోజ వర్గంలోని కోటపల్లి మండలంలో జనగామ గ్రామ పంచాయితీలో సోమవారం సీసీ రోడ్డు పనులను సర్పంచ్ మారిశెట్టి పద్మ కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతామన్నారు. రూ. 25 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సూపక సర్పంచ్ కశెట్టి సతీష్, వెంచపల్లి సర్పంచ్ పడల రవళి సతీష్, ఉప సర్పంచ్ తలండి ముత్తయ్య, మాజీ ఎంపీపీ దుర్గం వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ మరిశెట్టి తిరుపతి, మాజీ సర్పంచ్ భూతం కిష్టయ్య, సీనియర్ నాయకులు గట్టు భీమా గౌడ్, గట్టు తిరుపతి గౌడ్, కొడిశెట్టి చెంద్రయ్య, కొడిశెట్టి వెంకన్న, వార్డు సభ్యులు రాజన్న, మహేష్, మధునయ్య, లక్ష్మీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




