23-07-2025 12:36:06 AM
150 మొబైల్ ఫోన్లు రికవరీ
కామారెడ్డి, జూలై 22 (విజయ క్రాంతి) కామారెడ్డి జిల్లాలోస్పెషల్ డ్రైవ్ ద్వారా వారం రోజుల్లో రూ. 25 లక్షల విలువ చేసే సెల్ఫోన్లను పోలీస్ బృందం స్వాధీనం చేసుకున్నారు.150 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల పోలీస్ ప్రత్యేక బృందం రికవరీ చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న మొబైల్ పొందవచ్చు నని ఆయన పేర్కొన్నారు.
విలువైన సెల్ ఫోన్లు బాధ్యతారాహిత్యంగా పోగొట్టుకోవద్దన్నారు. సెల్ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సి ఈ ఐ ఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరికి గురైన 150 మొబైల్ ఫోన్లను సుమారు రూ. 25 లక్షల విలువగల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితు లకు అప్పగించడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుంద న్నారు. మొబైల్ పోయిన,చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు వెళ్ళి దరఖాస్తు ఇవ్వాలన్నారు. సిమ్ కార్డ్ బ్లాక్ చేసి అదే నంబరు గల కొత్త సిమ్ కార్డు తీసుకోవాలన్నారు. తద్వారా పోయిన మొబైల్ ఫోన్ల ఐఎంఈఐ వివరాలు సి ఈ ఐ ఆర్ వ్బుసైట్ లో బ్లాక్ చేయడం వలన పోగొట్టుకున్న మొబైల్ సులబంగా దొరికే అవకాశం ఉంటుందన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయములో పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్.ఎస్.ఐ12 మంది కానిస్టేబుల్స్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. 7రోజులలో ఈ టీం అధికారులు 150 ఫోన్ లను రికవరీ చేశారన్నారు. ఇప్పటి వరకు ఈ టీం అధికారులు 627 సెల్ఫోన్ లను రికవరీ చేశారని తెలిపారు. సి ఈ ఐ ఆర్ పోర్టల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు 3,551 ఫోన్ లను రికవరీ చేయడం బాధితులకు అందజెయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా 150 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన టీం సబ్యులు అందరినీ జిల్లా ఎస్పీ అభినందించారు. ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలిజేయడం జరుగుతుందన్నారు. వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్ఐ బాలరాజ్ ను సంప్రదించి 8712686114 ఫోన్ కు సంభంధించిన వివరాలు చూపించి సెల్ ఫోన్ లనూ తీసుకోవాలని కోరారు.