13 July, 2026 | 9:52 PM

Breaking News

33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •  

నాసా స్పేస్ కాంటెస్ట్‌లో శ్రీ చైతన్య విద్యార్థుల విజయ దుందుభి

23-07-2025 12:37 AM

కామారెడ్డి, జూలై 22 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో ఇటీవల అమెరికా నాసా అంతర్జాతీయ స్థాయిలో ఎన్ ఎస్ ఎస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2025 లో స్థానిక శ్రీ చైతన్య విద్యార్థులు విజయ ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిథిగా కోఆర్డినేటర్ మహిపాల్ రెడ్డి విచ్చేసి విద్యార్థులను అభినందించారు. వారి చేతుల మీదుగా మెమొంటోను  అందించారు.

ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. దానిలో భారత్ కు మొత్తం బహుమతులు లభించగా అందులో 30 వరకు శ్రీ చైతన్య విద్యార్థులు కైవసం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో కామారెడ్డి శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు చేసిన ప్రాజెక్టుకు మూడవ బహుమతి లభించినందుకు పాఠశాల ప్రిన్సిపల్ సంపత్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

వారికి నాసా సర్టిఫికెట్ మెమొంటోలను అందిస్తూ దీనికి సహకరించిన తల్లిదండ్రులను యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంపత్ కుమార్,డి రాకేష్,సి బ్యాచ్ ఇంచార్జ్ స్వామి,నాసా ఇన్చార్జ్ మధు,నవీన్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.