calender_icon.png 18 June, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొలుసు చోరీ..

17-06-2025 11:39:45 PM

నిందితుల అరెస్టు..

కార్వాన్: బంగారు గొలుసు చోరీ కేసులో టోలిచౌకి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి లక్షన్నర విలువ చేసే బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం టోలిచౌకి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సౌత్ బెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్(DCP Chandramohan) కేసు వివరాలను వెల్లడించారు. గనిపినేని బాబు అనే వ్యక్తి ఈనెల 14వ తేదీన మధ్యాహ్నం ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా అతని మెడలో ఉన్న 1.4 తులాల బంగారు గొలుసు చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ రమేష్ నాయక్ కేసు నమోదు చేశారు. డీఐ బాలరాజు(DI Balaraju) విచారణ ప్రారంభించారు.

ఇందులో భాగంగా 16వ తేదీ టోలిచౌకి రోడ్డులోని రెయన్ హోటల్ సమీపంలో ముగ్గురు నేరస్తులను అరెస్టు చేశారు. వారి నుంచి లక్షన్నర విలువచేసే బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. బండారి కేశవ్, కాంబ్లే శ్యాంసుందర్, సూరజ్, వంశీ, వంశీ వర్ధన్‌ను నిందితులుగా గుర్తించారు. ఏ వన్ పై గతంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదయి ఉన్నాయి. ఎ2 పైన కూడా కేసులు ఉన్నాయి. పీడీ చట్టం కింద జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. కేసును సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ పర్యవేక్షించారు. ఏ 1, ఏ 2, ఏ 3 ని రిమాండ్కు తరలించారు.  సమావేశంలో గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్, ఎస్‌ఐ రాఘవేంద్ర  తదితరులు పాల్గొన్నారు. కేసును ఛేధించిన  పోలీసులను ఈ సందర్భంగా డీసీపీ అభినందించారు.