30 July, 2026 | 5:50 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

సీఎం నివాసానికి కూతవేటు దూరంలో చైన్ స్నాచింగ్

18-02-2026 01:40 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాసానికి కొద్ది దూరంలో మంగళవారం స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు 27 ఏళ్ల మహిళ బంగారు గొలుసును(Chain snatching) దోచుకున్నారుకడపకు చెందిన ఫిర్యాదుదారు మానస మాదాపూర్‌లోని ఒక హాస్టల్‌లో ఉంటూ ఒక ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆమె తన ఆఫీసు వైపు నడుచుకుంటూ వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

స్కూటర్ నడుపుతున్న ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి అకస్మాత్తుగా వేగం తగ్గించాడు. వెనుక కూర్చున్న మహిళ మానస మెడలోని బంగారు గొలుసును లాక్కుంది. మానస స్పందించేలోపు ఆ ఇద్దరు అక్కడి నుండి పారిపోయారు. మనస జూబ్లీహిల్స్ పోలీసులను(Jubilee Hills Police) ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు  చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను గుర్తించడానికి చుట్టుపక్కల ప్రాంతంలోని నిఘా కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసుల వెల్లడించారు.