08-09-2025 12:00:00 AM
బాన్సువాడ, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణం లోని చక్రేశ్వర గణేష్ మండలి వద్ద నిర్వహించిన లడ్డు లక్కీ డ్రాలో పట్టణానికి చెందిన సిమెంటు వ్యాపారి సోమ పురుషోత్తం పెంటయ్య విజేతగా నిలిచారు.
లక్కీ డ్రాలో లడ్డు రావడం చాలా అదృష్టమని, వినాయకుని ఆశీస్సులు తమపై ఉన్నందుకు సంతోషంగా ఉందని, కుటుంబం మొత్తం సంతోషంగా వినాయక పండుగ నిర్వహించుకున్నామని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కుటుంబ సభ్యులు అన్నారు.