27-10-2025 12:00:00 AM
వెంకటాపూర్ (రామప్ప), అక్టోబర్26, (విజయక్రాంతి): నవంబర్ 1న చలో హైదరాబాద్ ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని ఎంఎస్పీ ములుగు జిల్లా కార్యదర్శి కాడపాక శ్యామ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో మండల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్యామ్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ బిఆర్ గవాయ్ మీద జరిగిన దాడి భారత రాజ్యాంగం పై జరిగిన దాడిగా భావించి ఎమ్మార్పీఎఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు నవంబర్ 1న తలపెట్టిన చలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ ర్యాలీ విజయవంతం చేయడానికి వెంకటాపూర్ మండలం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామం నుండి వాహనాలతో పెద్ద ఎత్తున జన సమీకరణతో తరలిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మారేపల్లి రాజు, కిరణ్, సతీష్, మారేపెళ్లి మాస్, కుమార్, నరసయ్య, రాజేష్, రమేష్ పాల్గొన్నారు.