22 May, 2026 | 9:30 PM

Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •  

బెల్లంపల్లికి చేరిన చలో కొత్తగూడెం యాత్ర

03-02-2025 11:21 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మారు పేర్ల కార్మికుల పిల్లలకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తూ చలో కొత్తగూడెం యాత్రలో భాగంగా సోమవారం బెల్లంపల్లికి చేరుకున్న మారు పేర్ల నాయకులకు సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిడ్డల విజయకుమార్ స్వాగతం పలికి మద్దతు తెలిపారు. బెల్లంపల్లి చిలక స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఈ యాత్ర కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మారుపేరుల సమస్యపై వినతిపత్రం ఇచ్చారు.

మారుపేర్ల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని సింగరేణి ఆపరేటర్స్ అండ్ కార్మిక సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. మారుపేర్ల సంఘం నాయకులు చేపట్టిన ఈ యాత్ర కొత్తగూడెం వరకు సరదాగా సాగేలా చూడాలని కోరారు. వీరి న్యాయమైన డిమాండ్ ను గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ యాత్రలో మారుపేర్ల సంఘం నాయకులు, ఎస్ ఓకే ఎస్, బి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షుడు బాడికల శ్రావణ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.