29-06-2025 07:43:02 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి...
బూర్గంపాడు (విజయక్రాంతి): బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు(BRS District President Rega Kantha Rao,) పిలుపుమేరకు సోమవారం ములకలపల్లి మండలం పూసుగూడెం సీతారామ పంపుహౌస్ వద్ద 11 గంటలకు తలపెట్టిన బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... సీతారామ ప్రాజెక్టు నీళ్లు పక్క జిల్లాలకు తరలించడాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చిత్రపటానికి పిండ ప్రధానం చేసే కార్యక్రమానికి మండలం నుంచి నాయకులు, అనుబంధ సంఘాల బాధ్యులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.