బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేష్
వరంగల్, మే 1 (విజయక్రాంతి): రాజకీయాల్లో రంగులు మార్చే ఊసరవెల్లి ఎమ్మె ల్యే కడియం శ్రీహరి అని బీజేపీ ఎంపీ అభ్య ర్థి అరూరి రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన పర్వత గిరి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి కుట్రలతోనే తాను ఓడిపోయానని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్ఠానం వరంగల్ ఎంపీ టికెట్ ఆ పార్టీలోని ఎస్సీ నేతలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు సీటిచ్చి సీనియర్ నేతలకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. టి.రాజయ్య, పసునూరి దయాకర్ బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కడియం శ్రీహరి కుట్రపన్నారని చెప్పారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్వర్రావు, కొండేటి శ్రీధర్, పార్టీ నేతలు ఎర్రబెల్లి ప్రదీప్రావు, గజ్జెల శ్రీరాములు, మాల్లాడి తిరుపతిరెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.