15 July, 2026 | 12:14 AM

గోదావరి జిల్లాల్లో వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న చంద్రబాబు

11-09-2024 01:46 PM

అమరావతి: ఇటీవలి వర్షాల ప్రభావాన్ని అంచనా వేయడానికి, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఏలూరు ప్రాంతంపై దృష్టి సారించి గోదావరి జిల్లాల్లో పర్యటించారు. తన పరిశీలనలో, ముఖ్యంగా కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో వరదల వల్ల జరిగిన అపారమైన నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. రోడ్డు మార్గంలో తమ్మిలేరులో వరద ప్రవాహాన్ని ముఖ్యమంత్రి నిశితంగా పరిశీలించారు. స్థానిక రహదారులపై దాని ప్రభావాలను గమనించారు. కొల్లేరు, ఉప్పేటేరు, తమ్మిలేరు ముంపు పరిస్ధితిపై చర్చించేందుకు అక్కడికక్కడే సమీక్షించిన చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.