6 May, 2026 | 9:03 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

11-09-2024 02:07 PM

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం 4:30కి ఢిల్లీకి పయనం కానున్నారు. సీఎంతో పాటు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ హస్తినకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. సీఎం, పీసీసీ చీఫ్‌ సోనియా గాంధీ అపాయింట్‌మెంట్‌ కోరారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు రేపు ఢిల్లీలో అందుబాటులో ఉండనున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఢిల్లీకి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా క్యాబినేట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చర్చించే అవకాశముంది. రాజకీయ అంశాలపై కాంగ్రెస్ ముఖ్యులతో రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.