17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నేర ప్రవృత్తిని మార్చుకోండి

30-12-2025 12:00 AM
  1. రౌడీషీటర్లకు ఖమ్మం టౌన్ 
  2. ఏసీపీ రమణమూర్తి కౌన్సెలింగ్ 

ఖమ్మం, డిసెంబర్ 29 (విజయక్రాంతి): పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు సోమవారం ఖమ్మం నగరంలోని రౌడీషీటర్లకు టౌన్ ఏసీపీ రమణమూర్తి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఏసీపీ కార్యాలయంలో ఒక్కొక్కరి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వారు ఎక్కడెక్కడ నివాసం ఉంటున్నారు.. ఏ పని చేసి జీవిస్తున్నారో ఆరా తీశారు. నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు.

గతంలో నేరాలకు పాల్పడిన పాత నేరస్తులు, రౌడీషీటర్లు, నేర స్వభావం గలవారు తమ నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మం చి నడవడికతో కొనసాగాలని సూచించారు నేరాలకు పాల్పడుతున్నట్లు తేలితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నా రు. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల కబ్జాలకు పాల్పడే రౌడీషీటర్లు, రియల్టర్లపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలిపారు.

నగరంలో జరిగే నేరాల్లో ఎక్కువగా రౌడీ షీటర్లే నిందితులుగా ఉంటున్నారని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుని దాడులకు దిగుతూ.. పో లీస్ రికార్డుల్లోకి ఎక్కుతున్న నేపథ్యంలో వా రిపై ప్రత్యేక నిఘా పెట్టి కట్టడి చేయడం లో భాగంగా ముందుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా గత కొంత కాలం గా తమ వైఖరిని మార్చుకుని ఎలాంటి నేరా లు పాల్పడకుండా, పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాకుండా సత్ప్రవర్తనతో వున్న పాత నేరస్థుల రౌడీషీట్‌ను తొలగించారు.