కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : ఇటీవల జిల్లాలోని బురపెల్లి, కొండపల్లి గ్రామాలకు చెందిన శంకర్, పోశన్నలపై ప్రమాదవశాత్తు ఏనుగు దాడి చేయగా మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబాలకు అటవీశాఖ నుంచి మంజూరయిన రూ.10 లక్షల చెక్కులను ఎఫ్డీఓ అప్పలకొండ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో కర్జెల్లి, పెంచికల్పేట్, కాగజ్నగర్ ఎఫ్ఆర్వోలు, ఎఫ్డీఓలు పాల్గొన్నారు.