6 May, 2026 | 11:01 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

పప్పు బాలేదంటూ చెఫ్‌పై దాడి

10-07-2025 01:25 AM

- శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ నిర్వాకం

ముంబై, జూలై 9: పప్పు బాగాలేదని చెఫ్‌ను ఎమ్మెల్యే చితక్కొట్టిన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆకాశవాణి ఎమ్మెల్యే రెసిడెన్స్‌లో ఉంటున్నారు. అక్కడి క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు వెళ్లారు. పప్పు, చపాతీతో పాటు రైస్ కావాలని ఆర్డర్ చేశారు.

అయితే పప్పు నుంచి దుర్వాసన రావడంతో ఆయన కోపం పట్టలేకపోయారు. ఒక ఎమ్మెల్యేకు ఇలాగే వడిస్తా రా? నాకే ఇలాంటి వంట పెడితే మిగతావారి పరిస్థితి ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశా రు. అనంతరం క్యాంటీన్ ఆపరేటర్ ముఖం పై సంజయ్ గైక్వాడ్  పంచుల వర్షం కురిపించాడు. ఇందులో విచారించాల్సిన అవసరం లేదన్నారు. అజ్ఞానులుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మా అధినేత బాల్ ఠాక్రే నేర్పించారు.