6 May, 2026 | 10:20 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

కల్తీ కల్లు బాధితులను పరామర్శించిన మంత్రి దామోదర

10-07-2025 02:45 PM

హైదరాబాద్: కూకట్ పల్లి కల్తీ కల్లు(Kukatpally adulterated toddy) తాగిన ఘటనలో బాధితుల సంఖ్య 44కు చేరింది. కల్తీ కళ్లు బాధితులను నిమ్స్‌లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Health Minister Damodar Rajanarsimha) పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని నిమ్స్ డైరెక్టర్ బీరప్పను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ సంఘటనలో ఇప్పటివరకు నలుగురు చనిపోయారని రాష్ట్ర మంత్రి దామోదర పేర్కొన్నారు.

నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)లో 31 మందికి,  గాంధీ ఆసుపత్రిలో ఆరుగురికి, వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో ఏడుగురు చికిత్స పొందుతున్నట్లు ఆయన వెల్లడించారు. నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో ఉన్నవారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, నలుగురి ఆరోగ్య పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందని, వారికి డయాలసిస్ చేస్తున్నట్లు మంత్రి దమోదర తెలిపారు. ఒక నాలుగైదు రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని, ఘటనపై పూర్తిస్థాయిలో ప్రభుత్వం విచారణ చేయిస్తుందని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం అవకుండా చర్యలుంటామని మంత్రి దమోదర వెల్లడించారు.