18-12-2025 02:27:00 PM
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించన మంత్రి శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని గుమ్మునుర్ సర్పంచ్ చేరుకుతోట సురేష్ మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ సర్పంచ్ చెరుకతోట సురేష్ కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నమ్మి ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించిన గ్రామ అభివృద్ధికి పాటుపడాలని మంత్రి సర్పంచికి సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.