calender_icon.png 8 June, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్వరం సిరప్ వికటించి చిన్నారి మృతి

08-06-2025 12:12:52 AM

మరో నలుగురు చిన్నారులకు అస్వస్థత

సంగారెడ్డి, జూన్ 7 (విజయక్రాంతి): జ్వ రం సిరప్ వికటించి ఐదేళ్ల చిన్నారి మృతిచెందగా, నలుగురు చిన్నారులు అస్వస్థత గురైన  సంఘటన సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల బం ధువుల కథనం ప్రకారం, అల్లాదుర్గం గ్రా మానికి చెందిన సిద్ధప్ప, భార్య సాయమ్మ లకు ఐదుగురు సంతానం, ఇద్దరు కుమారులు, ముగ్గురు ఆడపిల్లలు, ఈ చిన్నారులకు జ్వరం రావడంతో శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న జ్వరం సిరప్, పిల్లలకు వేయమని భార్యకు చెప్పి భర్త బయటకు వెళ్లినట్లు బంధువులు తెలిపారు.

భార్య సాయమ్మ ఐదుగురు పిల్లలకు జ్వరం మందు వేయడంతో చిన్నారులు అస్వస్థతకు గురికాగా, ఐదు సంవత్సరాల చిన్నారి ప్రియ మృతిచెందగా, మిగతా నలుగురికి చికిత్స నిమిత్తం జో గిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై బంధువులు అనుమానం వ్య క్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు వి చారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర శంకర్ తెలిపారు.

సిరప్ వికటించి చిన్నారి మృతి, మరో నలుగురు చిన్నారులకు అస్వస్థతపై స్పం దించిన అధికారులు శనివారం అల్లాదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. డ్రగ్ కంట్రోల్ అధికారి చంద్రకళ. ఆ సుపత్రిలోని మందులను , రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రిలోని పలు కంపెనీల జ్వరం, సిరప్ లను ల్యాబ్ కు పంపిస్తున్నట్లు,  దీనిపై పూర్తి విచారణ చేస్తామన్నారు.