15 June, 2026 | 8:18 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

హాంకాంగ్ అగ్నిప్రమాదం: పెరిగిన మృతుల సంఖ్య

28-11-2025 08:26 AM

హాంకాంగ్‌: హాంకాంగ్‌లోని ఒక నివాస సముదాయంలోని అనేక ఎత్తైన భవనాలను దగ్ధం చేసిన వినాశకరమైన అగ్నిప్రమాదంలో(Hong Kong Fire) శుక్రవారం మరణించిన వారి సంఖ్య 94కి పెరిగింది. బుధవారం చెలరేగిన మంటల తర్వాత చాలా మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం పోలీసులు, రక్షణ సిబ్బంది టవర్లలో వెతుకులాట కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. థాయి పో హౌసింగ్ కాంప్లెక్స్(Thai Po Housing Complex)లో ఏడు అపార్ట్ మెంట్లకు మంటలు వ్యాపించాయి. అధికారుల ప్రకారం హాంకాంగ్ అగ్నిప్రమాదంలో మరో 279 మంది ఆచూకీ గల్లంతయ్యారు. మంటలను ఆర్పేందుకు 2 రోజులుగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.

థాయి పో హౌసింగ్ కాంప్లెక్స్ లోని టవర్లలో మొత్తం 4 వేల నివాసాలున్నాయి. వాంగ్ ఫక్ కోర్ట్ కాంప్లెక్స్‌లోని కొన్ని కిటికీల నుండి దట్టమైన పొగ ఇప్పటికీ వెలువడుతోంది. చైనా ప్రధాన భూభాగానికి హాంకాంగ్(Hong Kong) సరిహద్దుకు సమీపంలోని ఉత్తర శివారు ప్రాంతమైన తాయ్ పోలో వేలాది మంది నివసించే భవనాల సమూహం ఇది. "మా అగ్నిమాపక ఆపరేషన్ దాదాపు పూర్తయింది. శిధిలాలు, నిప్పురవ్వలు ఎగసిపడకుండా నిరోధించడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. తదుపరిది శోధన, రెస్క్యూ ఆపరేషన్" అని ఫైర్ సర్వీసెస్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ డెరెక్ ఆర్మ్‌స్ట్రాంగ్ చాన్ అన్నారు.