28 March, 2026 | 2:10 AM

దుప్పట్లు పంపిణీ చేసిన చిరు అభిమానులు

28-03-2026 12:13 AM

అలంపూర్, మార్చి 27: సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి  రామ్ చరణ్ అభిమానులు ఉదారతను చాటుకున్నారు. శుక్రవారం రామ్ చరణ్ జన్మదిన  సందర్భంగా స్థానిక రాజోలి మండల కేంద్రంలో కేజీబీవీ విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ మండల అధ్యక్షులు పూల హుస్సేన్, ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా  మాట్లాడుతూ ....

అఖిల భారత చిరు యువత అధ్యక్షులు రవణం స్వామి నాయుడు సేవాస్ఫూర్తితో    పలు సేవా కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. సేవ కార్యక్రమాలు అందించడంలోనూ తృప్తి ఉందని భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి ,ఎండి నిషాక్ , సిద్ధ పవన్ కుమార్ బషీర్, ఎల్లప్ప ఇతరులు పాల్గొన్నారు.