15 June, 2026 | 10:35 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

31 నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్.. 100 వాహనాలు సీజ్

31-12-2025 12:17 PM

వాహనాలను సిజ్ చేసిన పట్టణ సీఐ శివశంకర్

కోదాడ,(విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతలు భద్రపరచేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్‌ 31 ఫస్ట్‌ నేపథ్యంలో మంగళవారం పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించినట్లు పట్టణ సీఐ శివశంకర్‌ తెలిపారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా పట్టణవ్యాప్తంగా మైనర్‌ డ్రైవింగ్‌, త్రిబుల్‌ రైడింగ్‌, వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడం, నెంబర్‌ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై చర్యలు తీసుకుని సుమారు 100 వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు.

నూతన సంవత్సర వేడుకల వేళ యువత ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీఐ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని చెప్పారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ శాఖ అప్రమత్తంగా ఉందని, ప్రజలు సహకరించాలని సీఐ శివశంకర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ హనుమాన్‌ నాయక్‌, ట్రాఫిక్‌ ఎస్ఐ అంజిరెడ్డి, ఏఎస్ఐలు షేక్‌ ఖయ్యూం, శ్రీనివాసరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ బాల్తు శ్రీనివాస్‌ తదితర సిబ్బంది పాల్గొన్నారు.