15 June, 2026 | 9:26 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

20 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్

31-12-2025 12:19 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): డీసీసీబీ చైర్మన్‌గా సేవలందిస్తూ, సహకార రంగాన్ని విశేషంగా అభివృద్ధి చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన కొండూరు రవీందర్ రావు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. హైదరాబాద్ నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్ ను కొండూరు రవీందర్ రావు  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సహకార రంగంలో ఆయన అందించిన సుదీర్ఘ సేవలు, అమలు చేసిన సంస్కరణలు, కరీంనగర్ డీసీసీబీని ఆదర్శ సంస్థగా నిలిపిన తీరును కేసీఆర్  కొనియాడారు.నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకును లాభాల బాటలో నడిపించి, రైతులు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులకు బలమైన ఆర్థిక అండగా నిలిపిన ఘనత కొండూరు రవీందర్ రావు  దక్కుతుందని కేసీఆర్ ప్రశంసించారు. సహకార రంగానికి ఆయన చేసిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.