15 June, 2026 | 7:02 PM

Breaking News

పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •  

యూరియా కోసం రైతుల గోస

31-12-2025 12:28 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో(Warangal district) రైతులు యూరియా(Urea) కోసం గోస పడుతున్నారు. యూరియా కోసం వ్యవసాయ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన యాప్ సరిగా పనిచేయకపోవడంతో రైతులకు కష్టాలు మళ్ళీ మొదటికి వచ్చాయి. దీనితో వ్యవసాయ శాఖ అధికారులు సైతం యాప్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేంతవరకు పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

దీనితో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామునే రైతులు రైతు వేదికలు, సొసైటీల వద్దకు ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ పత్రాలతో తరలివచ్చారు. విపరీతమైన చలిలో సైతం రైతులు యూరియా కోసం తరలి రావడంతో వివిధ చోట్ల  పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. క్యూ పద్ధతి కోసం ప్రత్యేకంగా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రైతుకు సాగు భూమి ఆధారంగా ఒకటి నుంచి మూడు చొప్పున యూరియా బస్తాలు పంపిణీ చేశారు.