31 March, 2026 | 12:39 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

31-03-2026 11:43 AM

హైదరాబాద్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి(BRS MLA Kaushik Reddy) రేవంత్ సర్కార్ భారీ షాకిచ్చింది. కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 4న హైదరాబాద్ లో విచారణకు హాజరుకావాలని నోటీసులు సీఐడీ పేర్కొంది. జనవరి 29న హుజూరాబాద్ లో సమ్మక్క సారక్క జాతర వేళ గొడవ దృష్ట్యా కౌశిక్ రెడ్డి, కరీంనగర్ సీపీ, పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ అధికారులు కేసు బుక్ చేశారు.