12-06-2025 12:27:58 AM
12 కేసుల నమోదు.. 25 సిలిండర్లు సీజ్
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 11 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం హోటల్లు, కర్రీ పాయింట్లు , రెస్టారెంట్ లలో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాల్వంచ సివిల్ సప్లై డిటి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. మొత్తం 25 వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహించి, 12 మందిపై 6a కేసులో నమోదు చేశారు. 35 సిలిండలను సీజ్ చేశారు.
ఇదెలా ఉండగా పాల్వంచలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో దొరికిన సిలిండర్లకు జిల్లాస్థాయి అధికార సిఫారసు మేరకు సివిల్ సప్లై అధికారులు వదిలి వేసినట్లు సమాచారం.గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్ లను వ్యాపార నిమిత్తం వినియోగించినందుకు గాను వారిపై కేసులు నమోదు చేసినట్లు సివిల్ సప్లై డిటిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన వెంట హెచ్.పీ గ్యాస్ మేనేజర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.