9 June, 2026 | 4:16 PM

Breaking News

కొలాయిడ్ సిస్టును తొలగించిన మలక్ పేట యశోద వైద్యులు   •   పొలం పనులు పూర్తికాకముందే తొందర పెడుతున్న తొలకరి జల్లులు   •   ప్రభుత్వ కళాశాలలో చేరాలని ప్రచారం   •   పిడుగులతో పాటు కురిసిన భారీ వర్షం వనికిన జనం   •   ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన కార్పోరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు   •   వైద్య సేవల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ కె.హరిత   •   ఆర్అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు   •   రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు   •   స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఎప్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం... పరిశ్రమల ద్వారా పెద్దఎత్తున ఉపాధి   •  

ముగిసిన సీఎం రేవంత్ జపాన్ పర్యటన

24-04-2025 02:14 AM

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజయవంతగా జపాన్ పర్యటన ముగించుకున్నారు. ఏడురోజుల పర్యటనలో సీఎం రాష్ట్రానికి రూ.12 వేల కోట్ల విలువైన పెట్టుబడులు తీసుకొచ్చారు. సీఎం బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. ఆయనకు ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, వీర్లపల్లి శంకర్, రామ్మోహన్‌రెడ్డి తదితరులు  ఘనస్వాగతం పలికారు. కాగా, సీఎం గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భారత్ సమ్మిట్ ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.