27-01-2026 12:26:45 AM
ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ తరగతులకు హాజరు
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనెడీ స్కూల్లో (కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్) ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ఆదివారం హాజరయ్యారు. తొలిరోజు పరిచయ కార్యక్రమంతో పాటు 21వ శతాబ్దంతో నాయకత్వం కోర్సుల్లో భాగంగా ‘అధికార విశ్లేషణ నాయకత్వం’ అంశంపై తొలిసెషన్ ప్రారంభమైంది.
సోమవారం ఉదయం నుంచే ప్రారంభమైన తరగతులు సాయంత్రం 6 వరకు కొనసాగాయి. ఇందులో కేస్ అనాలిసిస్, వివిధ అంశాలపై తరగతులు, కన్సల్టేటివ్ గ్రూప్ వర్క్స్ వంటి కార్యక్రమాల్లో సభ్యులు పాల్గొన్నారు. కాగా, బోస్టన్ ప్రాంతమంతా తీవ్ర శీతాకాల అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. భారీ మంచు తుఫాన్ కారణంగా రెండు అడుగులకు పైగా మంచు కురిసినట్లు సమాచారం.