15 April, 2026 | 12:02 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

ఆధ్యా ఐ కేర్ సేవలు అభినందనీయం

27-01-2026 12:27 AM

ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణమూర్తి 

సిద్దిపేట, జనవరి 26 (విజయక్రాంతి): సిద్దిపేటలో కంటి వైద్య సేవలు అందిస్తున్న ఆద్య ఐ కేర్ నిర్వాహకులు డాక్టర్ మాధవి, డాక్టర్ బాలకిషన్ సేవలు అభినందనీయమని ప్రముఖ సీనియర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం ఆధ్య ఐ కేర్ వార్షి కోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వైద్యులను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ పేదలైన వయోవృద్ధులకు ఉచితంగా ఆపరేషన్లు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంవత్సర కాలంలోనే సిద్దిపేట జిల్లాలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకోవడం ఆధ్య ఐ కేర్ కి సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గ్యాదర్ రవి, ప్రముఖ చార్టర్ అకౌంటెంట్ కాచం శేఖర్, చేర్యాల మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ, పలువురు వైద్యులు ప్రముఖులు, సిబ్బంది అనిల్, నవీన్, స్వాతి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.