23 June, 2026 | 10:22 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఆధ్యా ఐ కేర్ సేవలు అభినందనీయం

27-01-2026 12:27 AM

ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణమూర్తి 

సిద్దిపేట, జనవరి 26 (విజయక్రాంతి): సిద్దిపేటలో కంటి వైద్య సేవలు అందిస్తున్న ఆద్య ఐ కేర్ నిర్వాహకులు డాక్టర్ మాధవి, డాక్టర్ బాలకిషన్ సేవలు అభినందనీయమని ప్రముఖ సీనియర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం ఆధ్య ఐ కేర్ వార్షి కోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వైద్యులను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ పేదలైన వయోవృద్ధులకు ఉచితంగా ఆపరేషన్లు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంవత్సర కాలంలోనే సిద్దిపేట జిల్లాలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకోవడం ఆధ్య ఐ కేర్ కి సాధ్యమైందని తెలిపారు. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గ్యాదర్ రవి, ప్రముఖ చార్టర్ అకౌంటెంట్ కాచం శేఖర్, చేర్యాల మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ, పలువురు వైద్యులు ప్రముఖులు, సిబ్బంది అనిల్, నవీన్, స్వాతి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.