calender_icon.png 8 May, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

08-05-2025 04:33:29 PM

హైదరాబాద్: ఉప్పల్ మాజీ శాసనసభ్యులు బండారి రాజిరెడ్డి(78) గురువారం కన్నుమూశారు.  బండారి రాజిరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఉప్పల్ శాసనసభ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజిరెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి ఇవాళ తెల్లవారుజామున హబ్సిగూడలోని తన నివాసం తుదిశ్వాస విడిచారు.

పలువురు రాజకీయ నాయకులు రాజిరెడ్డి మృతికి సంతాపం తెలిపి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రేపు రాజీరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. హబ్సిగూడ నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానున్నట్లు ఆయన కుటుంబీకులు వెల్లడించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాజిరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై గెలుపొందారు. 2014లో ఆయన సోదరుడు బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023లో బీఆర్ఎస్ చేరి గెలుపొందారు.