calender_icon.png 17 June, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరు, ఏవిధంగా చనిపోయినా.. సంబురపడుతున్న ప్రతిపక్ష నేతలు

16-06-2025 07:25:18 PM

హైదరాబాద్:  ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేదని పరిస్థితి, రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించలేని పరిస్థితికి రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగజార్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రుణమాఫీ చేయలేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే చేసి చూపించామని రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం కొందరికే చుట్టంగా మారిందని, మొదటి రోజు నుంచి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రతిపక్షలు కుట్ర చేశాయని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు ఏవిధంగా చనిపోయినా ప్రతిపక్ష నేతలు సంబరపడుతున్నారని ఎద్దేవా చేశారు. 

బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ తో అరాచకం చేశారని, దీంతో భార్యాభర్తలు కూడా ఫోన్ లో స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థతి ఏర్పాడిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఒకే ఒక్క ఎస్సీ మంత్రి ఉండేవారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వీకర్ తో కలిపి ఐదుగురు ఎస్సీ నేతలకు పదవులు దక్కాయని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రైతుబంధు ఇచ్చి మిగతా పథకాలను రద్దు చేసిందని, పదేళ్లపాటు వ్యవసాయ పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇవ్వలేదన్నారు. ఈ ప్రజా ప్రభుత్వం మళ్లీ వ్యవసాయ పరికరాలు, డ్రిప్ ను ఇస్తోందని, రైతులు వ్యవసాయంలో సోలార్ పంపుసెట్లను ఉపయోగించాలన్నారు. భూములకు అనుకూలమైన పంటలనే రైతుల పండించారని, పేదలకు భూములు పంచింది, పట్టాలు పంచింది, భూ గరిష్ఠ పరిమితి చట్టం చేసి దొరల వద్ద ఉన్న అధిక భూమిని సేకరించిన భూమిని పేదలకు పంచింది ఇందిరమ్మ ప్రభుత్వమే అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.