calender_icon.png 17 June, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిపెల్లి, తాండ్రకు బస్సు సర్వీసు

16-06-2025 07:28:02 PM

నిర్మల్ (విజయక్రాంతి): వివిధ గ్రామాల ప్రజల విజ్ఞప్తి మేరకు సోమవారం నుండి నిర్మల్ మండలంలోని మేడిపల్లి మామున మండలం నుండి తాండ్ర వరకు బస్సు సర్వీసు ప్రారంభించినట్టు నిర్మల్ డిఎం పండరీ(Nirmal DM Pandari) తెలిపారు. ఈ బస్సు సర్వీసు అనంతపేట, నీలాయిపేట, మేడిపెల్లి,బూర్గుపెల్లి, మొండిగుట్ట, తాండ్ర గ్రామాలకు పల్లెవెలుగు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ బస్సు నిర్మల్ నుండి ఉదయం 07.20 బయలుదేరి 08.05 తాండ్రకు చేరుకుంటుంది. తిరిగి 08.20 తాండ్రనుండి బయలుదేరి 09.05 నిర్మల్ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం నిర్మల్ నుండి 04.50  తాండ్ర వెళుతుంది. ఈ సదవకాశాన్ని గ్రామ ప్రజలు, విద్యార్థులు సద్వినియోగపరచుకొని సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.