17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కేంద్ర ఆర్థికమంత్రితో ముగిసిన సీఎం భేటీ

16-12-2025 02:51 PM

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. నిర్మల సీతారామన్ కు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ అందించిన సీఎం  యంగ్ ఇండియా స్కూళ్ల ఖర్చులను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. యంగ్ ఇండియా స్కూళ్ల ప్రాజెక్టు డీపీఆర్ పంపాలని మంత్రి నిర్మల చెప్పడంతో డీపీఆర్ ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం.  యంగ్ ఇండియా స్కూళ్ల ఏర్పాటుకు కేంద్రం ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థికమంత్రికి వినతి పత్రం అందించారు.  రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రికి తెలిపారు.