07-07-2025 12:58:48 AM
- రెండురోజుల పాటు దేశ రాజధానిలోనే
- బకనచర్ల,పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో భేటీ
- క్యాబినెట్ బెర్తులు, నామినెటెడ్ పోస్టుల భర్తీపై అధిష్ఠానంతో చర్చ
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మ రోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పా టు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ పర్యటన లో ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో పా టు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అ య్యే అవకాశం ఉంది.
బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులకు మరోసారి ఫిర్యాదు చే యనున్నారు. రాష్ర్టంలో యూరియా కొరత తో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్రమంత్రి జేపీ నడ్డా తో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటా విడుదల కోసం విజ్ఞప్తి చే యను న్నట్లు తెలిసింది. అలాగే, మెట్రో రెండో దశ విస్తరణ డీపీఆర్, ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగం అంశాలపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించనున్నట్లు సమాచారం.
ఇక రా ష్ర్టం లో రేషన్కార్డుల సమస్యకు పరిష్కారం చూ పేలా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి కొత్త కార్డులు మంజూరు చేస్తోంది. ఇందు లో భాగంగా ఈ నెల 14న సూర్యాపేట జి ల్లా తిరుమలగిరిలో కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ఆ సభకు రావా లని అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీలను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. ఇక పార్టీ నేతలతో క్యాబినెట్లో మిగిలిన మూడు బెర్తుల భర్తీ, నామినేటెడ్ పోస్టులు, పార్టీ, ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత కు మ్ములాటలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉందని సమాచారం.