calender_icon.png 17 June, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు వేదికల్లో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

16-06-2025 08:13:26 PM

వలిగొండ (విజయక్రాంతి): రైతు వేదికల్లో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సెట్స్ ద్వారా ప్రతి మంగళవారం రైతు నేస్తం ప్రోగ్రాంలో రైతులకు వ్యవసాయ శాస్త్రజ్ఞులు వివిధ పంటల సాగు వివరాలు, చీడపీడల సమస్యల నివారణ వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రోగ్రాము రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, ఎంపీడీవో జితేందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి అంజనీదేవి, మండల పంచాయతీ అధికారి కేదారేశ్వర్, పాశం సత్తిరెడ్డి, మామిడి నరేందర్ రెడ్డి, బద్దం సంజీవరెడ్డి, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.