11 April, 2026 | 3:49 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

పార్టీ గీత దాటితే ఊరుకోను.. ఎమ్మెల్యేకు సీఎం హెచ్చరిక

15-04-2025 03:25 PM

మంత్రివర్గ విస్తరణలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అధ్యక్షతన మంగళవారం నాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం(Congress Legislature Party meeting) జరిగింది. సీఎల్సీ సమావేశంలో నాలుగు ముఖ్యాంశాలపై ప్రధానంగా చర్చించున్నారు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ-ఎస్టీ వర్గీకరణపై చర్చించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. సీఎల్సీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారని సూచించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఎంపీ చామల కిరణ్‌కి సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్‌ ఇచ్చినట్లు సమాచారం. రోజుకొకరిని మంత్రిగా నువ్వే ప్రకటిస్తున్నావు.. ఇది మంచి పద్ధతి కాదు.. అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలనేది హైకమాండ్‌ చూసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని మందలించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్ లు పాల్గొన్నారు.