21-08-2025 10:14:45 PM
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సబ్ కలెక్టర్ కిరణ్మయి(Sub-Collector Kiranmayi)ని జుక్కల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ సౌదగర్ అరవింద్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. నిజాంసాగర్ మండలం మర్పల్లి గ్రామం(అచ్చంపేట్) గ్రామస్తులకు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని వదలడంతో గ్రామస్తులు భయాందోళనకు గురికావడంతో సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి గ్రామస్తులకు సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మర్పల్లీ (అచ్చంపేట్) గ్రామస్తులు పాల్గొన్నారు.