17 March, 2026 | 6:53 AM

నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి

31-07-2024 03:11 PM

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.