13 July, 2026 | 9:42 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

ఏ ఒక్కటి చేజారొద్దు

16-02-2026 01:30 AM

హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్సే ఉండాలి

చైర్మన్లు, మేయర్ల ఎన్నికపై కాంగ్రెస్ నేతలు, మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ సమావేశం 

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మేయర్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం జూమ్ మీటింగ్ నిర్వహిం చారు. ఈ  జూమ్ మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్,  రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సోమవారం మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్ల, వైస్ చైర్మన్లు ఎన్నిక సందర్భంగా వ్యవహరించాల్సిన వ్యూహంపై జూమ్ మీ టింగ్‌లో సీఎం దిశా నిర్దేశం చేశారు. హంగ్ మున్సిపాలిటీల్లో ఎన్ని కాంగ్రెస్‌కి దక్కనున్నాయో పార్లమెంట్ ఇంచార్జిలతో అడిగి తెలుసుకున్నారు. నగరపాలక సంస్థల్లో మేయర్ల ఎన్నికపై ఇన్‌చార్జిలు వ్యవహరించాల్సిన అంశాలపై దిశ నిర్దేశం చేసారు. సామాజిక సమతుల్యత పాటించాలన్నారు. హంగ్ మున్సిపాలిటీల్లో ఏ ఒక్కటి చేజారకూడదని సీఎం స్పష్టం చేశారు.